ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం కూలీలపై భారంగా మారిన కొత్త నిబంధనలు: నర్సింహ
ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం కూలీలపై భారంగా మారిన కొత్త నిబంధనలు: నర్సింహ
Editor Desk
బీబీనగర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. గురువారం మండలంలోని మోద్గుంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.
గ్రామీణ పేదల జీవనోపాధికి ఆధారమైన ఈ పథకంపై కొత్త నిబంధనలు, జీవోలు విధించడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ-కేవైసీ విధానం కారణంగా పని ప్రదేశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి, కార్మికులకు కూలీ అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ఉపాధి హామీలో సరైన వేతనం లేకపోవడంతో పాటు పనిదినాలు కూడా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని బలోపేతం చేసి, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.800 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిస్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి