PRINT TIME: April 07, 2026 11:01 PM
ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ
ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ
April 07, 2026 09:09 PM
39 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనుల పరిశీలన
జనంపల్లి: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను ఎంపీడీఓ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని సర్పంచ్ బండ సరోజ, ఎంపీడీఓ రాములు సూచించారు.
పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కార్మికులకు తెలిపారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి