ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ
రామన్నపేట,
ఉపాధి హామీ కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ సూచించారు. శుక్రవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామ కార్యదర్శి ఉమా శంకర్ తో కలిసి పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేస్తున్న కూలీలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లను, తాగు నీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండలో పనిచేసే సమయంలో తరచూ నీరు తాగడం, తలపై టోపీ లేక తలపాక ధరించాలని సూచించారు. అవసరమైనప్పుడు ఓ ఆర్ ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా నీరసం, అలసట వంటి సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉదయశ్రీ, ఏఎన్ఎం కేతమ్మ, నడిగోటి గణేష్, జోగు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి