Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:37 PM

ఉపాధి హామీ కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్

ఉపాధి హామీ కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్

ఉపాధి హామీ కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.  సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్
April 24, 2026 07:51 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

రామన్నపేట,

ఉపాధి హామీ కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ సూచించారు. శుక్రవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామ కార్యదర్శి ఉమా శంకర్ తో కలిసి పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేస్తున్న కూలీలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లను, తాగు నీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండలో పనిచేసే సమయంలో తరచూ నీరు తాగడం, తలపై టోపీ లేక తలపాక ధరించాలని సూచించారు. అవసరమైనప్పుడు ఓ ఆర్ ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా నీరసం, అలసట వంటి సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉదయశ్రీ, ఏఎన్ఎం కేతమ్మ, నడిగోటి గణేష్, జోగు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News