Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:12 PM

ఉన్నత విద్యలో డిజిటల్ మార్పులు అవసరం. ప్రవీణ్ ఆకాష్

ఉన్నత విద్యలో డిజిటల్ మార్పులు అవసరం. ప్రవీణ్ ఆకాష్

ఉన్నత విద్యలో డిజిటల్ మార్పులు అవసరం. ప్రవీణ్ ఆకాష్
22-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో “ఉన్నత విద్యలో డిజిటల్ పరివర్తన” అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘స్వయం’ వేదిక ద్వారా ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని, విశ్వవిద్యాలయాలు పూర్తి స్థాయి ఆన్‌లైన్ డిగ్రీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు విద్యార్థులకు సమగ్ర అధ్యయన వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో డిజిటల్ మార్పులు అత్యవసరమని అన్నారు. విద్య, బోధన, సంస్థల నిర్వహణలో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సదస్సుకు అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించగా, అధ్యాపకులు, విభాగాధిపతులు, డీన్లు, సిబ్బంది, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఉన్నత విద్యలో డిజిటల్ మార్పులు అవసరం. ప్రవీణ్ ఆకాష్

Article Image

విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో “ఉన్నత విద్యలో డిజిటల్ పరివర్తన” అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘స్వయం’ వేదిక ద్వారా ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని, విశ్వవిద్యాలయాలు పూర్తి స్థాయి ఆన్‌లైన్ డిగ్రీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు విద్యార్థులకు సమగ్ర అధ్యయన వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో డిజిటల్ మార్పులు అత్యవసరమని అన్నారు. విద్య, బోధన, సంస్థల నిర్వహణలో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సదస్సుకు అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించగా, అధ్యాపకులు, విభాగాధిపతులు, డీన్లు, సిబ్బంది, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News