ఉన్నత విద్యలో డిజిటల్ మార్పులు అవసరం. ప్రవీణ్ ఆకాష్
ఉన్నత విద్యలో డిజిటల్ మార్పులు అవసరం. ప్రవీణ్ ఆకాష్
Editor Desk
విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో “ఉన్నత విద్యలో డిజిటల్ పరివర్తన” అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘స్వయం’ వేదిక ద్వారా ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని, విశ్వవిద్యాలయాలు పూర్తి స్థాయి ఆన్లైన్ డిగ్రీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు విద్యార్థులకు సమగ్ర అధ్యయన వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో డిజిటల్ మార్పులు అత్యవసరమని అన్నారు. విద్య, బోధన, సంస్థల నిర్వహణలో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సదస్సుకు అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించగా, అధ్యాపకులు, విభాగాధిపతులు, డీన్లు, సిబ్బంది, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి