Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:25 PM

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ
17-04-2026 127 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అయితే ఇంకా పలు న్యాయబద్ధ డిమాండ్లు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించి, న్యాయబద్ధ డిమాండ్లను అమలు చేయాలని ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జేఏసీ ప్రధాన డిమాండ్లు: జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డుల అమలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డీఏల విడుదల, వీఆర్ఏల సమస్యల పరిష్కారం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత, సాధారణ బదిలీలు చేపట్టడం తదితరాలు ఉన్నాయి.

కార్యక్రమంలో జేఏసీ నాయకులు పి. రాధ, ఆర్. ఉమా, కె. శ్రీధర్, పి. ఇందుమతి, వనం వెంకటేశ్వర్లు, పి. రవికుమార్, లోకేందర్ రెడ్డి, సైదా సాహెబ్, కల్యాణ్, ప్రణయ్, గుర్రాల బాలకృష్ణ, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ

Article Image

భువనగిరి: ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అయితే ఇంకా పలు న్యాయబద్ధ డిమాండ్లు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించి, న్యాయబద్ధ డిమాండ్లను అమలు చేయాలని ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జేఏసీ ప్రధాన డిమాండ్లు: జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డుల అమలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డీఏల విడుదల, వీఆర్ఏల సమస్యల పరిష్కారం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత, సాధారణ బదిలీలు చేపట్టడం తదితరాలు ఉన్నాయి.

కార్యక్రమంలో జేఏసీ నాయకులు పి. రాధ, ఆర్. ఉమా, కె. శ్రీధర్, పి. ఇందుమతి, వనం వెంకటేశ్వర్లు, పి. రవికుమార్, లోకేందర్ రెడ్డి, సైదా సాహెబ్, కల్యాణ్, ప్రణయ్, గుర్రాల బాలకృష్ణ, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News