Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 06:01 PM

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ
April 17, 2026 04:01 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అయితే ఇంకా పలు న్యాయబద్ధ డిమాండ్లు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించి, న్యాయబద్ధ డిమాండ్లను అమలు చేయాలని ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జేఏసీ ప్రధాన డిమాండ్లు: జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డుల అమలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డీఏల విడుదల, వీఆర్ఏల సమస్యల పరిష్కారం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత, సాధారణ బదిలీలు చేపట్టడం తదితరాలు ఉన్నాయి.

కార్యక్రమంలో జేఏసీ నాయకులు పి. రాధ, ఆర్. ఉమా, కె. శ్రీధర్, పి. ఇందుమతి, వనం వెంకటేశ్వర్లు, పి. రవికుమార్, లోకేందర్ రెడ్డి, సైదా సాహెబ్, కల్యాణ్, ప్రణయ్, గుర్రాల బాలకృష్ణ, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News