ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ
ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ
Editor Desk
భువనగిరి: ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అయితే ఇంకా పలు న్యాయబద్ధ డిమాండ్లు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించి, న్యాయబద్ధ డిమాండ్లను అమలు చేయాలని ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జేఏసీ ప్రధాన డిమాండ్లు: జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డుల అమలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డీఏల విడుదల, వీఆర్ఏల సమస్యల పరిష్కారం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత, సాధారణ బదిలీలు చేపట్టడం తదితరాలు ఉన్నాయి.
కార్యక్రమంలో జేఏసీ నాయకులు పి. రాధ, ఆర్. ఉమా, కె. శ్రీధర్, పి. ఇందుమతి, వనం వెంకటేశ్వర్లు, పి. రవికుమార్, లోకేందర్ రెడ్డి, సైదా సాహెబ్, కల్యాణ్, ప్రణయ్, గుర్రాల బాలకృష్ణ, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి