ఉద్యమకారులకు న్యాయం చేయాలి. జోగు అంజన్న
ఉద్యమకారులకు న్యాయం చేయాలి. జోగు అంజన్న
Editor Desk
తెలంగాణ: రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు నాయకత్వంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లినప్పటికీ ఇంకా పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తొలి, మలిదశల్లో పాల్గొని జైలు శిక్షలు అనుభవించినవారు, కేసులు ఎదుర్కొన్నవారు, గాయాల పాలైనవారికి సరైన గుర్తింపు, సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్, లాఠీ దాడులను ఎదుర్కొని పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు.
అర్హులైన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, కుటుంబాలను ఆదుకోవాలని, నిరుద్యోగులుగా మిగిలిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మరుగునపడిన ఉద్యమ నాయకులను గుర్తించి సత్కరించాలని కోరారు.
ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి