ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న
ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న
Editor Desk
రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుడు దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి మృతి ఉద్యమకారులకు తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. గురువారం పత్రికా ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
సిరిపురం గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి వయస్సు 40 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని గ్రామ స్థాయిలో సారథ్యం వహించారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ పిలుపులను అనుసరించి పోరాడిన ఆయన, మలిదశ ఉద్యమంలో ఆర్థికంగా నష్టపోయి జైలు జీవితం గడిపినట్లు చెప్పారు.
తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగిగా ఆయన నిరాశ చెందారని పేర్కొన్నారు. గుండెపోటుతో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారని తెలిపారు.
శ్రవణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారంపై సబ్ కమిటీ ఆలస్యం చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి