Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:54 PM

ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న

ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న

ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి  ప్రభుత్వం  సాయం చేయాలి. జోగు అంజన్న
09-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుడు దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి మృతి ఉద్యమకారులకు తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. గురువారం పత్రికా ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

సిరిపురం గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి వయస్సు 40 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని గ్రామ స్థాయిలో సారథ్యం వహించారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ పిలుపులను అనుసరించి పోరాడిన ఆయన, మలిదశ ఉద్యమంలో ఆర్థికంగా నష్టపోయి జైలు జీవితం గడిపినట్లు చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగిగా ఆయన నిరాశ చెందారని పేర్కొన్నారు. గుండెపోటుతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారని తెలిపారు.

శ్రవణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారంపై సబ్ కమిటీ ఆలస్యం చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.



Sthanikam

ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న

Article Image

రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుడు దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి మృతి ఉద్యమకారులకు తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. గురువారం పత్రికా ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

సిరిపురం గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి వయస్సు 40 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని గ్రామ స్థాయిలో సారథ్యం వహించారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ పిలుపులను అనుసరించి పోరాడిన ఆయన, మలిదశ ఉద్యమంలో ఆర్థికంగా నష్టపోయి జైలు జీవితం గడిపినట్లు చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగిగా ఆయన నిరాశ చెందారని పేర్కొన్నారు. గుండెపోటుతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారని తెలిపారు.

శ్రవణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారంపై సబ్ కమిటీ ఆలస్యం చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News