ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు
Editor Desk
రామన్నపేట:
కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు బీజేపీ యువమోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు తెలిపారు.
వేసవికాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడం కేంద్రం తీసుకున్న మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం అందజేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1 కిలో బియ్యం ఇస్తోందని తెలిపారు.
ఒక్క కిలో బియ్యంపై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.32 ఖర్చు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 మాత్రమే వెచ్చిస్తోందని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం ఉచిత రేషన్ కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు.
పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి