ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు
ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు
Prakash
శ్రీ సత్య సాయి జిల్లా
పరిగి మండల కేంద్రం, ఏప్రిల్ 24:
పరిగి మండల కేంద్రంలో ఇసుక రవాణా వ్యవహారంపై పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లను స్టేషన్కు పిలిపించిన ఎస్సై రవికుమార్, వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీని ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇసుక అవసరం ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా తమ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ అనుమతితోనే ఇసుకను తరలించాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుందని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.
చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవికుమార్ స్పష్టం

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి