Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగాల వెంకన్న మాదిగ నియామకం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 05:36 PM

ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు

ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు

ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు
April 24, 2026 03:48 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్య సాయి జిల్లా

పరిగి మండల కేంద్రం, ఏప్రిల్ 24:

పరిగి మండల కేంద్రంలో ఇసుక రవాణా వ్యవహారంపై పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లను స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై రవికుమార్, వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీని ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇసుక అవసరం ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా తమ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ అనుమతితోనే ఇసుకను తరలించాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుందని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవికుమార్ స్పష్టం

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News