Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:33 AM

ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు

ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు

ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు
24-04-2026 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్య సాయి జిల్లా

పరిగి మండల కేంద్రం, ఏప్రిల్ 24:

పరిగి మండల కేంద్రంలో ఇసుక రవాణా వ్యవహారంపై పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లను స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై రవికుమార్, వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీని ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇసుక అవసరం ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా తమ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ అనుమతితోనే ఇసుకను తరలించాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుందని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవికుమార్ స్పష్టం

Sthanikam

ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా

పరిగి మండల కేంద్రం, ఏప్రిల్ 24:

పరిగి మండల కేంద్రంలో ఇసుక రవాణా వ్యవహారంపై పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లను స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై రవికుమార్, వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీని ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇసుక అవసరం ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా తమ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ అనుమతితోనే ఇసుకను తరలించాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుందని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవికుమార్ స్పష్టం

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News