తిక్క స్వామి తాత దర్గాను సందర్శించిన టిడిపి యువనేత సిద్ధార్థ నాయుడు
తిక్క స్వామి తాత దర్గాను సందర్శించిన టిడిపి యువనేత సిద్ధార్థ నాయుడు
Editor Desk
పెనుకొండ: తిక్క స్వామి తాత దర్గా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు టిడిపి యువనేత కొంకా సిద్ధార్థ్ నాయుడు దర్గాను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
మూడు రోజుల క్రితం దర్గా కమిటీ సభ్యులు టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ను కలిసి దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా దర్గాకు తన సొంత నిధులతో రంగులు వేయిస్తానని సిద్ధార్థ నాయుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఆయన తిక్క స్వామి తాత దర్గాను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. దర్గా అభివృద్ధికి తాను సహకరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, అంబేద్కర్ నగర్ లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ బాలాజీ, సదుల్లా, పాండవుగల్ అయ్యన్న, రాయ్ నగర్ విజయ్, శంకర్, అరిఫ్, వెంకటేష్ తదితరులు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి