తల్లిదండ్రులతో సమావేశాలు.. విద్యార్థుల ప్రగతికి దోహదం. అదనపు కలెక్టర్
తల్లిదండ్రులతో సమావేశాలు.. విద్యార్థుల ప్రగతికి దోహదం. అదనపు కలెక్టర్
Editor Desk
భువనగిరి
తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రగతి, ప్రవర్తన, హాజరు, ప్రతిభ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు తెలిపారు.
గురువారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లిదండ్రులతో సమావేశాల ద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి మెరుగుదలకు తగిన సూచనలు ఇవ్వవచ్చన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యాసంపై ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండడం వల్ల సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించవచ్చన్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుని బోధన విధానాల్లో అవసరమైన మార్పులు చేయగలరని పేర్కొన్నారు. ఈ పరస్పర సంబంధం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి చదువుపై ఆసక్తిని పెంచుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించి, విద్యార్థులకు ప్రగతి నివేదికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు..
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి