Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:30 PM

తల్లిదండ్రులతో సమావేశాలు.. విద్యార్థుల ప్రగతికి దోహదం. అదనపు కలెక్టర్

తల్లిదండ్రులతో సమావేశాలు.. విద్యార్థుల ప్రగతికి దోహదం. అదనపు కలెక్టర్

తల్లిదండ్రులతో సమావేశాలు.. విద్యార్థుల ప్రగతికి దోహదం. అదనపు కలెక్టర్
April 23, 2026 05:26 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి

తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రగతి, ప్రవర్తన, హాజరు, ప్రతిభ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు తెలిపారు.

గురువారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లిదండ్రులతో సమావేశాల ద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి మెరుగుదలకు తగిన సూచనలు ఇవ్వవచ్చన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యాసంపై ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండడం వల్ల సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించవచ్చన్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుని బోధన విధానాల్లో అవసరమైన మార్పులు చేయగలరని పేర్కొన్నారు. ఈ పరస్పర సంబంధం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి చదువుపై ఆసక్తిని పెంచుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించి, విద్యార్థులకు ప్రగతి నివేదికలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News