తాళ్లసింగారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
తాళ్లసింగారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు తాళ్లసింగారం గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. బుధవారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 KV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆమె ప్రారంభించారు.మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. దీనివల్ల గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, లో-ఓల్టేజీ సమస్య తప్పుతుందని వివరించారు. ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నర్సింహా గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్, కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, దొనకొండ కృష్ణ, శ్రీశైలం, గణేష్, గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి