Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

తాళ్లసింగారంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

తాళ్లసింగారంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

తాళ్లసింగారంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
15-04-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు తాళ్లసింగారం గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. బుధవారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 KV విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆమె ప్రారంభించారు.​మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. దీనివల్ల గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, లో-ఓల్టేజీ సమస్య తప్పుతుందని వివరించారు. ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నర్సింహా గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్, కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, దొనకొండ కృష్ణ, శ్రీశైలం, గణేష్, గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తాళ్లసింగారంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు తాళ్లసింగారం గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. బుధవారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 KV విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆమె ప్రారంభించారు.​మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. దీనివల్ల గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, లో-ఓల్టేజీ సమస్య తప్పుతుందని వివరించారు. ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నర్సింహా గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్, కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, దొనకొండ కృష్ణ, శ్రీశైలం, గణేష్, గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News