Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:14 PM

తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్

తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్

 తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్
24-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: తై-బజార్ టెండర్‌పై అసత్య ప్రచారాలు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుమిడెల్లి రమేష్ సూచించారు. టెండర్ దక్కకపోవడంతో అక్కసుతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు ప్రతి ఏడాది నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల మద్దతుతో సిండికేట్లు ఏర్పడి మున్సిపల్ ఆదాయానికి నష్టం కలిగించారని ఆరోపించారు.

గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.8.70 లక్షలకు టెండర్ పొందగా, ఈసారి రూ.12 లక్షలకు టెండర్ దక్కిందని తెలిపారు. మున్సిపాలిటీకి ఆదాయం పెంచిన కొత్త యాజమాన్యంపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

తై-బజార్‌లో పనిచేసే సిబ్బందిని బెదిరించడం, పనికి అడ్డంకులు కల్పించడం జరుగుతోందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై బహిరంగ విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.

Sthanikam

తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్

Article Image

భువనగిరి: తై-బజార్ టెండర్‌పై అసత్య ప్రచారాలు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుమిడెల్లి రమేష్ సూచించారు. టెండర్ దక్కకపోవడంతో అక్కసుతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు ప్రతి ఏడాది నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల మద్దతుతో సిండికేట్లు ఏర్పడి మున్సిపల్ ఆదాయానికి నష్టం కలిగించారని ఆరోపించారు.

గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.8.70 లక్షలకు టెండర్ పొందగా, ఈసారి రూ.12 లక్షలకు టెండర్ దక్కిందని తెలిపారు. మున్సిపాలిటీకి ఆదాయం పెంచిన కొత్త యాజమాన్యంపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

తై-బజార్‌లో పనిచేసే సిబ్బందిని బెదిరించడం, పనికి అడ్డంకులు కల్పించడం జరుగుతోందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై బహిరంగ విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News