తై-బజార్పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్
తై-బజార్పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్
Editor Desk
భువనగిరి: తై-బజార్ టెండర్పై అసత్య ప్రచారాలు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుమిడెల్లి రమేష్ సూచించారు. టెండర్ దక్కకపోవడంతో అక్కసుతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు ప్రతి ఏడాది నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల మద్దతుతో సిండికేట్లు ఏర్పడి మున్సిపల్ ఆదాయానికి నష్టం కలిగించారని ఆరోపించారు.
గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.8.70 లక్షలకు టెండర్ పొందగా, ఈసారి రూ.12 లక్షలకు టెండర్ దక్కిందని తెలిపారు. మున్సిపాలిటీకి ఆదాయం పెంచిన కొత్త యాజమాన్యంపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.
తై-బజార్లో పనిచేసే సిబ్బందిని బెదిరించడం, పనికి అడ్డంకులు కల్పించడం జరుగుతోందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై బహిరంగ విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి