Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 03:08 PM

తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్

తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్

 తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్
April 24, 2026 05:54 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: తై-బజార్ టెండర్‌పై అసత్య ప్రచారాలు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుమిడెల్లి రమేష్ సూచించారు. టెండర్ దక్కకపోవడంతో అక్కసుతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు ప్రతి ఏడాది నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల మద్దతుతో సిండికేట్లు ఏర్పడి మున్సిపల్ ఆదాయానికి నష్టం కలిగించారని ఆరోపించారు.

గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.8.70 లక్షలకు టెండర్ పొందగా, ఈసారి రూ.12 లక్షలకు టెండర్ దక్కిందని తెలిపారు. మున్సిపాలిటీకి ఆదాయం పెంచిన కొత్త యాజమాన్యంపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

తై-బజార్‌లో పనిచేసే సిబ్బందిని బెదిరించడం, పనికి అడ్డంకులు కల్పించడం జరుగుతోందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై బహిరంగ విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News