Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ సేవల బలోపేతానికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ – ఎమ్మెల్యే సంజీవరెడ్డి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 07:47 PM

తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్

తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్

 తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్
April 24, 2026 05:54 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: తై-బజార్ టెండర్‌పై అసత్య ప్రచారాలు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుమిడెల్లి రమేష్ సూచించారు. టెండర్ దక్కకపోవడంతో అక్కసుతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు ప్రతి ఏడాది నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల మద్దతుతో సిండికేట్లు ఏర్పడి మున్సిపల్ ఆదాయానికి నష్టం కలిగించారని ఆరోపించారు.

గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.8.70 లక్షలకు టెండర్ పొందగా, ఈసారి రూ.12 లక్షలకు టెండర్ దక్కిందని తెలిపారు. మున్సిపాలిటీకి ఆదాయం పెంచిన కొత్త యాజమాన్యంపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

తై-బజార్‌లో పనిచేసే సిబ్బందిని బెదిరించడం, పనికి అడ్డంకులు కల్పించడం జరుగుతోందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై బహిరంగ విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News