Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోండి: గౌస్ పాషా ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 11:30 PM

టెర్రస్‌పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.

టెర్రస్‌పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.

టెర్రస్‌పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.
April 16, 2026 08:49 PM 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ఎస్ ఐ డి.నాగరాజు

వేసవి కాలంలో ఇళ్ల పైకప్పులపై (టెర్రస్) లేదా బయట నిద్రించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దొంగతనాల ప్రమాదం కూడా అధికమవుతోందని రామన్నపేట పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామన్నపేట ఎస్‌ఐ డి.నాగరాజు సూచించారు.

రాత్రి వేళల్లో నిర్లక్ష్యం వల్ల దొంగలకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా టెర్రస్‌పై నిద్రించే వారు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పోలీసులు సూచించిన భద్రతా చర్యలు:

ఇంటి ప్రధాన తలుపులు, కిటికీలు బిగించి పెట్టాలి

టెర్రస్‌పై నిద్రిస్తే మెట్లు/ప్రవేశ మార్గాలకు తాళం వేయాలి

ఇంటి బయట సరిపడా లైటింగ్ ఉండేలా చూసుకోవాలి

మొబైల్ ఫోన్లు, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు బయట ఉంచకూడదు

అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి

గ్రామ రక్షక దళాలు రాత్రి పహారా నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలి

ఇంటి గోడలు, గేట్లు బలంగా ఉన్నాయో పరిశీలించాలి

అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

అనుమానాస్పద శబ్దాలు వినిపిస్తే ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి

అత్యవసర పరిస్థితుల్లో 112కి కాల్ చేయాలి

ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే దొంగతనాలను నివారించవచ్చని, భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు తెలిపారు.


రామన్నపేట పోలీస్ స్టేషన్

ఎస్ ఐ డి నాగరాజు

Cell.8712662487

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News