Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 08:22 PM

టెర్రస్‌పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.

టెర్రస్‌పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.

టెర్రస్‌పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.
April 16, 2026 08:49 PM 184 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ఎస్ ఐ డి.నాగరాజు

వేసవి కాలంలో ఇళ్ల పైకప్పులపై (టెర్రస్) లేదా బయట నిద్రించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దొంగతనాల ప్రమాదం కూడా అధికమవుతోందని రామన్నపేట పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామన్నపేట ఎస్‌ఐ డి.నాగరాజు సూచించారు.

రాత్రి వేళల్లో నిర్లక్ష్యం వల్ల దొంగలకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా టెర్రస్‌పై నిద్రించే వారు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పోలీసులు సూచించిన భద్రతా చర్యలు:

ఇంటి ప్రధాన తలుపులు, కిటికీలు బిగించి పెట్టాలి

టెర్రస్‌పై నిద్రిస్తే మెట్లు/ప్రవేశ మార్గాలకు తాళం వేయాలి

ఇంటి బయట సరిపడా లైటింగ్ ఉండేలా చూసుకోవాలి

మొబైల్ ఫోన్లు, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు బయట ఉంచకూడదు

అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి

గ్రామ రక్షక దళాలు రాత్రి పహారా నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలి

ఇంటి గోడలు, గేట్లు బలంగా ఉన్నాయో పరిశీలించాలి

అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

అనుమానాస్పద శబ్దాలు వినిపిస్తే ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి

అత్యవసర పరిస్థితుల్లో 112కి కాల్ చేయాలి

ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే దొంగతనాలను నివారించవచ్చని, భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు తెలిపారు.


రామన్నపేట పోలీస్ స్టేషన్

ఎస్ ఐ డి నాగరాజు

Cell.8712662487

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News