టెర్రస్పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.
టెర్రస్పై నిద్రిస్తే ప్రమాదమా..?. వేసవిలో దొంగల బెడదపై పోలీసుల హెచ్చరిక.
Editor Desk
రామన్నపేట ఎస్ ఐ డి.నాగరాజు
వేసవి కాలంలో ఇళ్ల పైకప్పులపై (టెర్రస్) లేదా బయట నిద్రించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దొంగతనాల ప్రమాదం కూడా అధికమవుతోందని రామన్నపేట పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామన్నపేట ఎస్ఐ డి.నాగరాజు సూచించారు.
రాత్రి వేళల్లో నిర్లక్ష్యం వల్ల దొంగలకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా టెర్రస్పై నిద్రించే వారు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
పోలీసులు సూచించిన భద్రతా చర్యలు:
ఇంటి ప్రధాన తలుపులు, కిటికీలు బిగించి పెట్టాలి
టెర్రస్పై నిద్రిస్తే మెట్లు/ప్రవేశ మార్గాలకు తాళం వేయాలి
ఇంటి బయట సరిపడా లైటింగ్ ఉండేలా చూసుకోవాలి
మొబైల్ ఫోన్లు, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు బయట ఉంచకూడదు
అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
గ్రామ రక్షక దళాలు రాత్రి పహారా నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలి
ఇంటి గోడలు, గేట్లు బలంగా ఉన్నాయో పరిశీలించాలి
అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
అనుమానాస్పద శబ్దాలు వినిపిస్తే ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి
అత్యవసర పరిస్థితుల్లో 112కి కాల్ చేయాలి
ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే దొంగతనాలను నివారించవచ్చని, భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు తెలిపారు.
రామన్నపేట పోలీస్ స్టేషన్
ఎస్ ఐ డి నాగరాజు
Cell.8712662487
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి