Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:08 AM

తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ.

తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ.

తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ.
April 10, 2026 11:55 AM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ సూచించారు.

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తిప్పర్తి మండలం దుప్పలపల్లి, అంతయ్యగూడెం గ్రామాల్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు.

గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా కొద్ది ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టకుండా, ప్రజల కష్టార్జితాన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల రూపంలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పోకల శశిధర్, నాయకులు సోమనబోయిన రాజేష్, కన్నెబోయిన శంకర్, మైల సైదులు, దొంగరి అచ్యుత్, గుర్రాల విగ్నేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News