తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ.
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ.
Editor Desk
తెలంగాణలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ సూచించారు.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తిప్పర్తి మండలం దుప్పలపల్లి, అంతయ్యగూడెం గ్రామాల్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు.
గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా కొద్ది ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టకుండా, ప్రజల కష్టార్జితాన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల రూపంలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పోకల శశిధర్, నాయకులు సోమనబోయిన రాజేష్, కన్నెబోయిన శంకర్, మైల సైదులు, దొంగరి అచ్యుత్, గుర్రాల విగ్నేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి