Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:30 PM

తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ

తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ

తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ
April 17, 2026 04:06 PM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ డిమాండ్ చేశారు. నల్లగొండలో నిర్వహించిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.

పార్లమెంట్‌లో డిలిమిటేషన్ చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆంధ్ర–తెలంగాణ విభజనను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగాలతో ఏర్పడిందని గుర్తు చేస్తూ, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ, వెంటనే బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, నాగయ్య, శివ, సాయి, మహేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు





మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News