Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 06:01 PM

తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ

తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ

తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ
April 17, 2026 04:06 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ డిమాండ్ చేశారు. నల్లగొండలో నిర్వహించిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.

పార్లమెంట్‌లో డిలిమిటేషన్ చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆంధ్ర–తెలంగాణ విభజనను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగాలతో ఏర్పడిందని గుర్తు చేస్తూ, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ, వెంటనే బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, నాగయ్య, శివ, సాయి, మహేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు





మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News