తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ
తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ
Editor Desk
నల్లగొండ: తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ డిమాండ్ చేశారు. నల్లగొండలో నిర్వహించిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.
పార్లమెంట్లో డిలిమిటేషన్ చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆంధ్ర–తెలంగాణ విభజనను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగాలతో ఏర్పడిందని గుర్తు చేస్తూ, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ, వెంటనే బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, నాగయ్య, శివ, సాయి, మహేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి