Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 09:46 PM

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి
April 21, 2026 08:02 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డికి వినతిపత్రం అందజేత

ఇంటి స్థలం, పింఛను మంజూరు చేయాలని డిమాండ్‌

మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి ఆదుకోవాలని చౌటుప్పల్ మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కోరారు. మంగళవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. స్వరాష్ట్ర కాంక్షతో ఆనాడు అన్నీ వదులుకొని, ఉద్యమమే ఊపిరిగా పోరాటంలో పాల్గొన్నామని గుర్తుచేశారు. ఆ సమయంలో తమపై నమోదైన పోలీసు కేసులు, జైలు జీవితం వల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.​ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించి, ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలి.​వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యమకారులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి.​ఉచిత వైద్యం కోసం హెల్త్ కార్డులు, ప్రయాణాల కోసం బస్ పాసులు మంజూరు చేయాలి.​ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్న అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి.​అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఉద్యమకారులకు ప్రాధాన్యతనిస్తూ నామినేటెడ్ పదవులు ఇవ్వాలి.​ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు కట్టెల లింగస్వామి, పెద్దగొని రమేష్, ఫకీరు శ్రీనివాస్ రెడ్డి, బోరం ప్రకాశ్ రెడ్డి, ఎస్.కె మున్న, గుంటొజు ఆంజనేయచారి, ఎండి ఇబ్రహీం, సంగిశెట్టి జనార్ధన్, రిక్కల ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News