Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:11 AM

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి
April 21, 2026 08:02 PM 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డికి వినతిపత్రం అందజేత

ఇంటి స్థలం, పింఛను మంజూరు చేయాలని డిమాండ్‌

మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి ఆదుకోవాలని చౌటుప్పల్ మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కోరారు. మంగళవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. స్వరాష్ట్ర కాంక్షతో ఆనాడు అన్నీ వదులుకొని, ఉద్యమమే ఊపిరిగా పోరాటంలో పాల్గొన్నామని గుర్తుచేశారు. ఆ సమయంలో తమపై నమోదైన పోలీసు కేసులు, జైలు జీవితం వల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.​ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించి, ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలి.​వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యమకారులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి.​ఉచిత వైద్యం కోసం హెల్త్ కార్డులు, ప్రయాణాల కోసం బస్ పాసులు మంజూరు చేయాలి.​ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్న అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి.​అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఉద్యమకారులకు ప్రాధాన్యతనిస్తూ నామినేటెడ్ పదవులు ఇవ్వాలి.​ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు కట్టెల లింగస్వామి, పెద్దగొని రమేష్, ఫకీరు శ్రీనివాస్ రెడ్డి, బోరం ప్రకాశ్ రెడ్డి, ఎస్.కె మున్న, గుంటొజు ఆంజనేయచారి, ఎండి ఇబ్రహీం, సంగిశెట్టి జనార్ధన్, రిక్కల ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News