తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి
K.RAVI
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేత
ఇంటి స్థలం, పింఛను మంజూరు చేయాలని డిమాండ్
మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి ఆదుకోవాలని చౌటుప్పల్ మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కోరారు. మంగళవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. స్వరాష్ట్ర కాంక్షతో ఆనాడు అన్నీ వదులుకొని, ఉద్యమమే ఊపిరిగా పోరాటంలో పాల్గొన్నామని గుర్తుచేశారు. ఆ సమయంలో తమపై నమోదైన పోలీసు కేసులు, జైలు జీవితం వల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించి, ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలి.వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యమకారులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి.ఉచిత వైద్యం కోసం హెల్త్ కార్డులు, ప్రయాణాల కోసం బస్ పాసులు మంజూరు చేయాలి.ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్న అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి.అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఉద్యమకారులకు ప్రాధాన్యతనిస్తూ నామినేటెడ్ పదవులు ఇవ్వాలి.ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు కట్టెల లింగస్వామి, పెద్దగొని రమేష్, ఫకీరు శ్రీనివాస్ రెడ్డి, బోరం ప్రకాశ్ రెడ్డి, ఎస్.కె మున్న, గుంటొజు ఆంజనేయచారి, ఎండి ఇబ్రహీం, సంగిశెట్టి జనార్ధన్, రిక్కల ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి