Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 PM

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి
March 30, 2026 10:29 AM 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుర్తింపు కార్డులు, పింఛన్‌ల కోసం ఉద్యమకారుల డిమాండ్

రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం నాయకులు ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లు వినిపించారు.

ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారులకు రూ.10 లక్షల మెడికల్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.

అలాగే ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులతో ఆదుకోవాలని, ఉద్యమకారులపై ఉన్న కేసులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రామన్నపేట మండలాధ్యక్షులు నోముల శంకర్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్, మండల ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, ఉద్యమ నాయకులు ఎండి ఇమామ్, బోగారం మాజీ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.





మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News