Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోటీ పరీక్షలకు నల్గొండలో ‘ఫోకస్’ శిక్షణ కేంద్రం ప్రారంభం. శ్రీనివాస్ రెడ్డి 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! ప్రభుత్వ ఉద్యోగుల సేవలు, వసతి సౌకర్యాలపై బాబాసాహెబ్ అంబేడ్కర్ స్పష్టత: నాగ భీమ్ డైరీ (29 మార్చి 1945). తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 01:09 PM

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి
March 30, 2026 10:29 AM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుర్తింపు కార్డులు, పింఛన్‌ల కోసం ఉద్యమకారుల డిమాండ్

రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం నాయకులు ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లు వినిపించారు.

ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారులకు రూ.10 లక్షల మెడికల్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.

అలాగే ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులతో ఆదుకోవాలని, ఉద్యమకారులపై ఉన్న కేసులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రామన్నపేట మండలాధ్యక్షులు నోముల శంకర్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్, మండల ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, ఉద్యమ నాయకులు ఎండి ఇమామ్, బోగారం మాజీ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.





మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News