Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 07:12 PM

టీబీ నిర్మూలనపై కేంద్ర బృందం సమీక్ష.

టీబీ నిర్మూలనపై కేంద్ర బృందం సమీక్ష.

టీబీ నిర్మూలనపై కేంద్ర బృందం సమీక్ష.
April 23, 2026 05:35 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట/భువనగిరి

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ బృందం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించి టీబీ నిర్మూలన చర్యలను సమీక్షించింది.

సెంట్రల్ టీబీ డివిజన్ అదనపు కమిషనర్ డా. వీణా ధావన్, రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డా. రాజేశం, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. మనోహర్ యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆరోగ్య కేంద్రంలో టీబీ రోగులకు అందుతున్న చికిత్సలు, మందులు, పరీక్షలపై బృందం సమీక్ష నిర్వహించింది. రోగులతో మాట్లాడి సేవలపై వివరాలు తెలుసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మాట్లాడుతూ, టీబీ బాధితులు వైద్యులు సూచించిన విధంగా DOTS చికిత్సను క్రమం తప్పకుండా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రోగులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.

తదుపరి బృందం కాచారం గ్రామంలో నిర్వహిస్తున్న టీబీ స్క్రీనింగ్ శిబిరాన్ని సందర్శించి మొబైల్ ఎక్స్‌రే పరీక్షలు, స్క్రీనింగ్ విధానాన్ని పరిశీలించింది. ప్రజలతో మాట్లాడి అందుతున్న ఆరోగ్య సేవలపై వివరాలు తెలుసుకుంది.

అనంతరం అదనపు కలెక్టర్ భాస్కరరావును కలసి జిల్లాలో టీబీ నిర్మూలన చర్యలపై వివరాలు అందించారు. జిల్లాలో అందిస్తున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేయగా, కేంద్ర బృందం ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సుమన్ కళ్యాణ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. వంశీకృష్ణ, టీబీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News