Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 05:59 PM

ట్యాంక్‌బండ్‌పై ‘ఏంఎన్‌ఎస్’ బ్లాక్ సెల్యూట్ ర్యాలీ

ట్యాంక్‌బండ్‌పై ‘ఏంఎన్‌ఎస్’ బ్లాక్ సెల్యూట్ ర్యాలీ

ట్యాంక్‌బండ్‌పై ‘ఏంఎన్‌ఎస్’ బ్లాక్ సెల్యూట్ ర్యాలీ
April 15, 2026 05:52 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం (ఏంఎన్‌ఎస్) ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన ‘బ్లాక్ సెల్యూట్’ ర్యాలీ భారీగా జరిగింది. నాలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి నగరాన్ని నల్లరంగులో ముంచెత్తారు.

సంఘం జాతీయ అధ్యక్షుడు డా. బైరి నరేష్, జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత టీచర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమాజంలో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీని మంత్రి లక్ష్మణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. డప్పు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేలాది మందితో రాజ్యాంగ పీఠిక పఠనం చేయించి, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో భాగంగా ‘పుస్తక యోగ’, ‘అక్షరధ్యానం’ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించగా, చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రత్యామ్నాయ పద్ధతిలో దండల పెళ్లిళ్లు నిర్వహించారు.

ర్యాలీ అనంతరం ప్రభుత్వం నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి డా. బైరి నరేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం కు వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, అకునూరి మురళి, సీ. అంజనేయ రెడ్డి తదితరులు హేతువాద దృక్పథంపై మాట్లాడారు. ప్రతి ఇల్లు విజ్ఞాన కేంద్రంగా మారాలని, మూఢనమ్మకాలపై యువత పోరాడాలని డా. బైరి నరేష్ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News