Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 11:07 PM

ట్యాంక్‌బండ్‌పై ‘ఏంఎన్‌ఎస్’ బ్లాక్ సెల్యూట్ ర్యాలీ

ట్యాంక్‌బండ్‌పై ‘ఏంఎన్‌ఎస్’ బ్లాక్ సెల్యూట్ ర్యాలీ

ట్యాంక్‌బండ్‌పై ‘ఏంఎన్‌ఎస్’ బ్లాక్ సెల్యూట్ ర్యాలీ
April 15, 2026 05:52 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం (ఏంఎన్‌ఎస్) ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన ‘బ్లాక్ సెల్యూట్’ ర్యాలీ భారీగా జరిగింది. నాలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి నగరాన్ని నల్లరంగులో ముంచెత్తారు.

సంఘం జాతీయ అధ్యక్షుడు డా. బైరి నరేష్, జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత టీచర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమాజంలో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీని మంత్రి లక్ష్మణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. డప్పు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేలాది మందితో రాజ్యాంగ పీఠిక పఠనం చేయించి, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో భాగంగా ‘పుస్తక యోగ’, ‘అక్షరధ్యానం’ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించగా, చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రత్యామ్నాయ పద్ధతిలో దండల పెళ్లిళ్లు నిర్వహించారు.

ర్యాలీ అనంతరం ప్రభుత్వం నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి డా. బైరి నరేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం కు వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, అకునూరి మురళి, సీ. అంజనేయ రెడ్డి తదితరులు హేతువాద దృక్పథంపై మాట్లాడారు. ప్రతి ఇల్లు విజ్ఞాన కేంద్రంగా మారాలని, మూఢనమ్మకాలపై యువత పోరాడాలని డా. బైరి నరేష్ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News