సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!
సురక్షిత మాతృత్వమే ఆరోగ్యకర భవిష్యత్తుకు బాట!
Editor Desk
ఇంద్రపాలనగరం: గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సురక్షిత మాతృత్వంపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో MLHP జ్యోతి, MPHA అరుంధతి, MPHA సునీత, ఆశా వర్కర్లు బాలమణి, వరమ్మ, శ్యామల, వసంత పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ వెంకటేష్, మంటి బిక్షం, మేకల నరేందర్, బట్టు రాము, కోలుకుల పల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి