శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం, సోమందేపల్లి గ్రామ పంచాయతీ (SWPC షెడ్స్)లో పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి వారికి గిఫ్ట్స్ అందజేశారు. గ్రామ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సేవలను కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి నిరీగంటి చంద్రశేఖర్, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, టౌన్ అధ్యక్షుడు వడ్డే సురేష్, డిప్యూటీ ఎంపీడీవో ప్రేమ కుమార్ పాల్గొన్నారు. అలాగే సోమందేపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి