సిరిపురంలో పార్వతీ పరమేశ్వర స్వామి పండుగ వైభవం
సిరిపురంలో పార్వతీ పరమేశ్వర స్వామి పండుగ వైభవం
స్థానికం బృందం
.రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానంలో 16వ పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణపతి పూజ, నవగ్రహ పూజ, మహాన్యాస రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. అనంతరం నిర్వహించిన మంగళారతుల్లో మహిళా భక్తులు, భజన బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రాపోలు రమేష్, ఉప సర్పంచ్ మూడు దుడ్ల అనుష రమేష్, మాజీ ఎంపీటీసీలు పున్న వెంకటేశం, బడుగు రమేష్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీ నర్స్, మాజీ ఉపసర్పంచ్ పున్న వెంకటేశం, దాసిరెడ్డి శ్రవణ్ కుమార్, ఆలయ ధర్మకర్తలు సూదిని చంద్రారెడ్డి, బల్గూరి లింగస్వామి, మామిడి చందన భాస్కర్, పబ్బు వెంకటేశం, కొంగరి జంగయ్య, సింగం నరసింహ, ఏళ్ల సునీత, అప్పం గణేష్, సంగిశెట్టి గణేష్, పున్న కార్తిక్, వార్డు సభ్యులు గాదె యాదయ్య, కంకల అర్చనమల్లేష్, గాదె శంకరయ్య, జెల్ల సురేఖ, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్లా శ్రీనివాస్, అప్పం శ్రీనివాస్, మామిడి పెంటయ్య, పురోహితులు అప్పం పృద్వి రాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి