PRINT TIME: April 05, 2026 10:33 PM
సిరిపురంలో అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్
సిరిపురంలో అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్
April 05, 2026 06:18 PM
17 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరగనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షులుగా సుక్క శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కమిటీ గౌరవ సలహాదారులుగా గాదే పెంటయ్య, మామిడి పెంటయ్యలను నియమించగా, గౌరవ అధ్యక్షులుగా గాదె యాదయ్య, గాదె శంకరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా గాదె అరవింద్, నందిపాటి అనిల్ నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలుగా గాదె రమేష్, గాదె సురేష్ పనిచేయనుండగా, సంయుక్త కార్యదర్శులుగా గాడే జానీ, ముటాపురం చంద్రశేఖర్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి