సిపిఎం సీనియర్ నాయకుడు దాట్ల చంద్రయ్యకు ఘన నివాళులు
సిపిఎం సీనియర్ నాయకుడు దాట్ల చంద్రయ్యకు ఘన నివాళులు
Editor Desk
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జలరావుపేట గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు దాట్ల చంద్రయ్య గుండెపోటుతో అకాల మరణం చెందడం పట్ల పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి పుష్పగుచ్చాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ మాట్లాడుతూ దాట్ల చంద్రయ్య పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడని అన్నారు. సిపిఎం పార్టీలో ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగి ప్రజల కోసం నిరంతరం పనిచేశారని పేర్కొన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. నేటి యువత దాట్ల చంద్రయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం కూసుమంచి మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, జిల్లా నాయకులు మల్లెల సన్మంతరావు, షేక్ బషీర్, పాలేరు డివిజన్ నాయకులు సేలం గురుమూర్తి, ఎడవెల్లి రమణారెడ్డి, మండల నాయకులు ఎస్.కె బాబు, జుజ్జలరావుపేట గ్రామ సీనియర్ నాయకులు వెల్లంపల్లి అశోక్, గ్రామ సర్పంచ్ దాట్ల సలీం, గ్రామ నాయకులు బక్కతట్రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై చంద్రయ్యకు జోహార్లు అర్పించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి