శ్రీ వాసవి మాత దేవాలయ భూమి పూజప్రారంభం
శ్రీ వాసవి మాత దేవాలయ భూమి పూజప్రారంభం
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండల కేంద్రం లోశ్రీ వాసవి మాత అనుగ్రహం తో పెనుగొండ వాసవి శాంతి ధామం దేవాలయం పీఠాధి పతి శ్రీ శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతీ బాల స్వామి వారి ఆశీర్వాదంతో శ్రీ వాసవి వైశ్య సేవా సమితి, మండల ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత దేవాలయం, శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయముల శంఖు స్థాపనలను వేద పండితులు మంత్రమూర్తి ఆదిత్య మూర్తి శర్మ, గంగాధర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ వాసవి మాత సేవా సమితి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఈగా దయాకర్ గుప్త పాల్గొన్నారు.ఈ సందర్బంగా శ్రీ వాసవి వైశ్య సేవా సమితి అధ్యక్షులు పాలవరపు సంతోష్, మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఈగా నాగన్న మాట్లాడుతూ తుంగతుర్తి మండల కేంద్రంలో విశ్వమాత ఆర్యవైశ్యుల. కులదైవం శ్రీ వాసవి మాత దేవాలయం మరియు శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయముల నిర్మాణం కొరకు 102 మంది ఆర్యవైశ్యులతో ట్రస్ట్ సభ్యులుగా ఏర్పాటు చేసుకొని దేవాలయాముల నిర్మాణం కొరకు ఈరోజు శంఖు స్థాపన చేసి నట్లు తెలిపారు.ఇంకా ఆర్యవైశ్య బంధువులు దేవాలయం నిర్మాణం కొరకు సహకారం అందించి అమ్మ వారి, స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరారు.
పూజా కార్యక్రమం అనంతరం ఆర్యవైశ్య బంధువులకు కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తీర్ద, ప్రసాదం అందించి, అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి వైశ్య సేవా సమితి సభ్యులు, మండల ఆర్యవైశ్య మహాసభ సభ్యులు, దేవాలయం ట్రస్ట్ సభ్యులు ఓరుగంటి అంతయ్య, ఈగా లక్ష్మయ్య, తాటికొండ సీతయ్య, తల్లాడ కేదారి, బుద్ధా వీరయ్య, బండారు దయాకర్, చెర్వీరాల మల్లయ్య, ఈగా శ్రీనివాస్, తాళపల్లి సత్య నారాయణ, తాళపల్లి సోమయ్య, ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి