శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
Vikram
సూర్యాపేట మండలం చివ్వెంల ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి కళారాణి, పూజ్యపాద్ మంత్రస్వరూప్ దాస్ జి స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుమారు 392 శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందని, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెరిగితేనే భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్ వంటి వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే వేదికలని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలు, ప్రాజెక్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి