శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి
శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి
Editor Desk
యాదగిరిగుట్ట,:
పట్టణంలో దేవస్థాన భూమిలో అక్రమంగా షెడ్డు నిర్మాణం జరిగిందని ఆరోపిస్తూ సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు Karre Praveen మాట్లాడుతూ దేవస్థానం ఈఓ నుంచి సింహద్వారం సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నోటీసులు జారీ చేసినప్పటికీ అవి పట్టించుకోకుండా షెడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.
మున్సిపల్ కమిషనర్కు సమాచారం లేకుండానే, పట్టణ ప్రణాళిక అధికారుల అనుమతి లేకుండా, మున్సిపల్ తీర్మానం లేకుండా నిర్మాణం ఎలా జరిగిందని ప్రశ్నించారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ స్వయంగా షెడ్డు నిర్మాణం తానే చేపట్టినట్లు మీడియా సమావేశంలో చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
అక్రమ నిర్మాణంలో స్థానిక ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, సీసీ కెమెరా దృశ్యాలు దీనికి ఆధారమని పేర్కొన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మందోజు నరేష్, కార్యదర్శులు ప్రభాకర్, కర్ణ, సురేష్, నాయకులు లెంకలపల్లి శ్రీను, బోడ సురేష్, భాస్కర్ రెడ్డి, బుచ్చిబాబు, అజయ్, శ్యామ్, విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి