Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:44 PM

శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి

శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి

శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి
April 25, 2026 07:51 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,:

పట్టణంలో దేవస్థాన భూమిలో అక్రమంగా షెడ్డు నిర్మాణం జరిగిందని ఆరోపిస్తూ సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు Karre Praveen మాట్లాడుతూ దేవస్థానం ఈఓ నుంచి సింహద్వారం సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నోటీసులు జారీ చేసినప్పటికీ అవి పట్టించుకోకుండా షెడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.

మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం లేకుండానే, పట్టణ ప్రణాళిక అధికారుల అనుమతి లేకుండా, మున్సిపల్ తీర్మానం లేకుండా నిర్మాణం ఎలా జరిగిందని ప్రశ్నించారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ స్వయంగా షెడ్డు నిర్మాణం తానే చేపట్టినట్లు మీడియా సమావేశంలో చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

అక్రమ నిర్మాణంలో స్థానిక ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, సీసీ కెమెరా దృశ్యాలు దీనికి ఆధారమని పేర్కొన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మందోజు నరేష్, కార్యదర్శులు ప్రభాకర్, కర్ణ, సురేష్, నాయకులు లెంకలపల్లి శ్రీను, బోడ సురేష్, భాస్కర్ రెడ్డి, బుచ్చిబాబు, అజయ్, శ్యామ్, విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News