PRINT TIME: April 11, 2026 11:02 AM
శక్తి యాప్ పై తిరువూరులో మహిళల కు అవగాహన కార్యక్రమం
శక్తి యాప్ పై తిరువూరులో మహిళల కు అవగాహన కార్యక్రమం
January 20, 2026 07:19 PM
91 Views
స్థానికం ప్రతినిధి :
Krishna District
A Arunkumar
స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి అరుణ్ తిరువూరుమహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తీ ఆప్ పై తిరువూరు పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ సీతమహాలక్ష్మి మహిళలకు శక్తీ ఆప్ ఉపయోగం, నమోదు విధానం, అత్యవసర సమయంలో యాప్ ద్వారా ఎలా సహాయం పొందాలో వివరించారు.
అనుకోని ప్రమాదాలు, వేధింపుల సమయంలో శక్తీ ఆప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుందని, యాప్లోని ఎమర్జెన్సీ ఫీచర్లు మహిళలకు రక్షణగా నిలుస్తాయని ఆమె తెలిపారు. ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ యాప్ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, శక్తీ ఆప్ పై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి