సీబీఎస్ఈ ఫలితాల్లో అన్నా మెమోరియల్ పాఠశాల ప్రభంజనం
సీబీఎస్ఈ ఫలితాల్లో అన్నా మెమోరియల్ పాఠశాల ప్రభంజనం
K.RAVI
పదిలో వంద శాతం ఉత్తీర్ణత.. పాఠశాల టాపర్గా డి. సాన్వి
2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో చౌటుప్పల్లోని అన్నా మెమోరియల్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది.
పాఠశాలకు చెందిన విద్యార్థిని డి. సాన్వి 500 మార్కులకు గాను 473 మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచింది. మరికొందరు విద్యార్థులు ప్రథమ శ్రేణిలో మార్కులు సాధించి మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల మేనేజర్ ఫాదర్ చిన్నప్ప రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థుల నిరంతర పట్టుదల, కఠోర శ్రమ.ఉపాధ్యాయుల ప్రత్యేక మార్గదర్శకత్వం, బోధనా పద్ధతులు.తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహం.విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసానికి తమ పాఠశాల ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ ఫలితాలు నిరూపించాయని యాజమాన్యం పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి