Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 09:52 PM

స్వయం ఉపాధిపై మహిళలు దృష్టి పెట్టాలి డీఆర్‌డీఏ అధికారి టి. నాగిరెడ్డి

స్వయం ఉపాధిపై మహిళలు దృష్టి పెట్టాలి డీఆర్‌డీఏ అధికారి టి. నాగిరెడ్డి

స్వయం ఉపాధిపై మహిళలు దృష్టి పెట్టాలి డీఆర్‌డీఏ అధికారి టి. నాగిరెడ్డి
April 21, 2026 08:24 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకుని, శిక్షణతో ముందుకు సాగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) అధికారి టి. నాగిరెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో సేర్ఫ్ సహకారంతో, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఉదిత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలకు గార్మెంట్ కటింగ్, స్కూల్ యూనిఫార్మ్స్ తయారీపై శిక్షణ ఇచ్చి, అనంతరం ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ భువనగిరి, వలిగొండ, బీబీనగర్, యాదగిరిగుట్ట, రామన్నపేట, మోత్కూర్, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజపేట మండలాలకు చెందిన సుమారు 200 మంది మహిళలకు కుట్టు శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.

జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి కె. జంగారెడ్డి మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలకు వచ్చే నెలలో ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంల తయారీకి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. శిక్షణను క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రమణ, భువనగిరి ఏపీఎం మల్లేష్, ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు పాశం అలివేలు జనార్ధన్, మోత్కూర్ ట్రైనింగ్ సెంటర్ అధికారి లక్ష్మీనారాయణ, శిక్షణాధ్యాపకులు విజయ, గీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News