స్వయం ఉపాధిపై మహిళలు దృష్టి పెట్టాలి డీఆర్డీఏ అధికారి టి. నాగిరెడ్డి
స్వయం ఉపాధిపై మహిళలు దృష్టి పెట్టాలి డీఆర్డీఏ అధికారి టి. నాగిరెడ్డి
Editor Desk
భువనగిరి, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకుని, శిక్షణతో ముందుకు సాగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారి టి. నాగిరెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో సేర్ఫ్ సహకారంతో, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఉదిత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు గార్మెంట్ కటింగ్, స్కూల్ యూనిఫార్మ్స్ తయారీపై శిక్షణ ఇచ్చి, అనంతరం ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ భువనగిరి, వలిగొండ, బీబీనగర్, యాదగిరిగుట్ట, రామన్నపేట, మోత్కూర్, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజపేట మండలాలకు చెందిన సుమారు 200 మంది మహిళలకు కుట్టు శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.
జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి కె. జంగారెడ్డి మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలకు వచ్చే నెలలో ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంల తయారీకి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. శిక్షణను క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రమణ, భువనగిరి ఏపీఎం మల్లేష్, ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు పాశం అలివేలు జనార్ధన్, మోత్కూర్ ట్రైనింగ్ సెంటర్ అధికారి లక్ష్మీనారాయణ, శిక్షణాధ్యాపకులు విజయ, గీత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి