Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 08:24 AM

స్వయం ఉపాధి అవకాశాలపై మహిళలు ఆశక్తిని పెంచుకోవాలి

స్వయం ఉపాధి అవకాశాలపై మహిళలు ఆశక్తిని పెంచుకోవాలి

స్వయం ఉపాధి అవకాశాలపై  మహిళలు ఆశక్తిని పెంచుకోవాలి
April 21, 2026 08:03 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి టి.నాగిరెడ్డి

మహిళలు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన, శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి టీ నాగిరెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో సేర్ఫ్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) సహకారంతో ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉదిత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ లో ఏంపవరింగ్ రూరల్ స్వయం సహాయక సంఘాల మహిళలకు గార్మెంట్ కటింగ్,స్కిల్స్ ఫర్ స్కూల్ యూనిఫార్మ్స్ పై శిక్షణ పొందిన మహిళలకు ధృవ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ భువనగిరిలోని ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి,వలిగొండ,బీబీనగర్,యాదగిరిగుట్ట, రామన్నపేట,మోటకొండూరు,తుర్కపల్లి,బొమ్మలరామారం,మరియు రాజపేట మండలాలకు చెందిన సుమారు 200 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లా అడిషనల్ గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కే.జంగారెడ్డి మాట్లాడుతూ... శిక్షణ పొందిన మహిళలకు వచ్చే నెలలో జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ తయారు చేసే అవకాశాన్ని శిక్షణ పొందిన మహిళలకు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ తో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రమణ,భువనగిరి ఏపీఎం మల్లేష్,ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు పాశం.అలివేలు జనార్ధన్,మోత్కూర్ ట్రైనింగ్ సెంటర్ అధికారి లక్ష్మీనారాయణ, ట్రైనింగ్ టీచర్స్ పబ్బల.విజయ,గీత,మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News