స్వయం ఉపాధి అవకాశాలపై మహిళలు ఆశక్తిని పెంచుకోవాలి
స్వయం ఉపాధి అవకాశాలపై మహిళలు ఆశక్తిని పెంచుకోవాలి
Sthanikam District Staff Reporter
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి టి.నాగిరెడ్డి
మహిళలు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన, శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి టీ నాగిరెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో సేర్ఫ్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) సహకారంతో ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉదిత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ లో ఏంపవరింగ్ రూరల్ స్వయం సహాయక సంఘాల మహిళలకు గార్మెంట్ కటింగ్,స్కిల్స్ ఫర్ స్కూల్ యూనిఫార్మ్స్ పై శిక్షణ పొందిన మహిళలకు ధృవ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ భువనగిరిలోని ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి,వలిగొండ,బీబీనగర్,యాదగిరిగుట్ట, రామన్నపేట,మోటకొండూరు,తుర్కపల్లి,బొమ్మలరామారం,మరియు రాజపేట మండలాలకు చెందిన సుమారు 200 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లా అడిషనల్ గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కే.జంగారెడ్డి మాట్లాడుతూ... శిక్షణ పొందిన మహిళలకు వచ్చే నెలలో జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ తయారు చేసే అవకాశాన్ని శిక్షణ పొందిన మహిళలకు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ తో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రమణ,భువనగిరి ఏపీఎం మల్లేష్,ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు పాశం.అలివేలు జనార్ధన్,మోత్కూర్ ట్రైనింగ్ సెంటర్ అధికారి లక్ష్మీనారాయణ, ట్రైనింగ్ టీచర్స్ పబ్బల.విజయ,గీత,మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి