Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు పాల్గొని సహకరించాలి:చింత గోపాల్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 10:06 PM

స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం

స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం

స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం
April 27, 2026 04:36 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పేదలకు ఉచిత వైద్య సేవలు అభినందనీయం....


పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని 34వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండు సహకారంతో కుర్రి సీతారాములు జ్ఞాపకార్థం ఆయన, 10 వ వర్ధంతి సందర్భంగా యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో దాదాపు 400 మందికి అన్ని రకాల వ్యాధులతో పాటు షుగర్, బీపీ, ఈసీజీ, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. లయన్స్ కంటి ఆసుపత్రి వారిచే కంటి పరీక్షలు చేసి మందులు అందించడంతోపాటు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సామాజిక సేవలో స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ గంధం బాలేంద్ర,పాండు లు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల తో పాటు వైద్యులను శాలువా, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్లు నాగేశ్వరరావు, వంగూరి గోపి, తోట శ్రీను, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ, రాజశేఖర్, ఓరుగంటి కిట్టు, గుండె పంగు రమేష్, కాంపాటి పుల్లయ్య, ఏర్పుల తిరుప్, శ్రావణ్, కుర్రి నాగరాజు, కుర్రి శ్రీను, కుర్రి వెంకమ్మ,కుడుముల శ్రీను, వంశీ, హేమావతి, చిట్టిప్రోలు నారాయణ తదితరులు పాల్గొన్నారు.........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News