Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:48 PM

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్
09-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ ఐఏఎస్ హనుమంతరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వయంభూ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, సిద్ధార్థాచార్యులు, డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు శంకర్ నాయక్, మహేష్ కుమార్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, రాజన్ బాబు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది నందు నాయక్, అనిల్, ఆలయ ఇంచార్జ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్

Article Image

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ ఐఏఎస్ హనుమంతరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వయంభూ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, సిద్ధార్థాచార్యులు, డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు శంకర్ నాయక్, మహేష్ కుమార్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, రాజన్ బాబు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది నందు నాయక్, అనిల్, ఆలయ ఇంచార్జ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News