స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్
స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్
Editor Desk
యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ ఐఏఎస్ హనుమంతరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వయంభూ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, సిద్ధార్థాచార్యులు, డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు శంకర్ నాయక్, మహేష్ కుమార్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, రాజన్ బాబు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది నందు నాయక్, అనిల్, ఆలయ ఇంచార్జ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి