Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:05 AM

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్
April 09, 2026 08:15 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ ఐఏఎస్ హనుమంతరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వయంభూ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, సిద్ధార్థాచార్యులు, డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు శంకర్ నాయక్, మహేష్ కుమార్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, రాజన్ బాబు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది నందు నాయక్, అనిల్, ఆలయ ఇంచార్జ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News