స్వామినారాయణ గురుకుల్ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత
స్వామినారాయణ గురుకుల్ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత
Vikram
సూర్యాపేటలోని స్వామినారాయణ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి (సిబిఎస్ఈ) ఫలితాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనవిజయాన్ని సాధించాయని పాఠశాల యాజమాన్యం తెలిపింది. గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో మొత్తం 98 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 100 శాతం ఉత్తీర్ణత సాధించడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్. ప్రభాత్ 479 మార్కులతో అగ్రస్థానం సాధించగా, కె. జస్వంత్ 473 మార్కులు, పి. డక్షవీర్ రావు 471 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారని తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 88 మంది 70 శాతానికి పైగా, 53 మంది 80 శాతానికి పైగా మార్కులు సాధించడం ద్వారా పాఠశాల విద్యా ప్రమాణాలు మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలిచాయని వివరించారు. ఈ ఫలితాలతో పాఠశాల జిల్లా స్థాయిలో డిస్టింక్షన్ మార్కులలో ప్రథమ స్థానాన్ని సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుందని పేర్కొన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం కలిసొచ్చిన ఫలితమే ఈ విజయమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రస్వరూపదాస్ స్వామీజీ, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుత ఫలితాలను కొనసాగిస్తూ మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తామని ప్రిన్సిపాల్ పేర్కొన్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి