స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి
స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి
Sthanikam District Staff Reporter
యాదగిరిగుట్ట డిపో మేనేజర్ మురళీ కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత
స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సీ.హెచ్ మురళీకృష్ణ అన్నారు. సోమవారం భువనగిరి కొత్త బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "చలివేంద్రం"ను ఆయన స్థానిక కౌన్సిలర్ శ్రీలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మురళీకృష్ణ,కౌన్సిలర్ శ్రీలత లు మాట్లాడుతూ...శ్రీ సత్యసాయి సేవా సమితి భువనగిరి సభ్యులు గత కొన్ని ఏళ్లుగా భువనగిరి బస్టాండ్ లో వేసవిలో చలివేంద్రంను ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు.ఈ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు సోమ కృష్ణమూర్తి,కస్తూరి లక్ష్మీనారాయణ, సోమ సరస్వతి,వంగపల్లి అంజయ్య స్వామి,కుక్కడపు చంద్రశేఖర్,చింతపండు రాజు,పసుపు నూరి వాణి,బుస్సా కృష్ణవేణి,గట్ఠు రమాదేవి,సామాజిక కార్యకర్తలు కొడారి వెంకటేష్,మాటూరి బాలేశ్వర్,జంపాల అంజయ్య,యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్,సిబ్బంది వెంకటయ్య,శ్రీధర్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి