సత్తుపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల నియామక సన్నాహక సమావేశం
సత్తుపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల నియామక సన్నాహక సమావేశం
Editor Desk
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) నియామకానికి సంబంధించి కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆదేశాల మేరకు బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థ అవసరమని, అందులో భాగంగా BLAల నియామకం కీలకమని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నా కేశవరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ బేగం, వైస్ చైర్మన్ సుమతి రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి