సర్పంచ్లకు సాధన సమితి సన్మానం
సర్పంచ్లకు సాధన సమితి సన్మానం
Editor Desk
రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమ్మాయిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, తీరుపాల ఐలయ్యలను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ… సాధన సమితి కార్యక్రమాలలో భాగంగా ప్రజాప్రతినిధులను ప్రోత్సహించడం లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గ సాధన కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని, అవసరమైతే ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ, సాధన సమితి కమిటీకి అభినందనలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సాధన సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, ఎర్ర శేఖర్, బత్తుల సత్తయ్య, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, విజయభాస్కర్, దండుగుల రాములు, నరేందర్, బోయపల్లి మల్లేశం, అంబాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి