Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:06 AM

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
April 07, 2026 02:55 PM 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని

నీర్నేముల: గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకులు, అధికారులు చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య అన్నారు. సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మంచినీటి ట్యాంకును పరిశీలించారు.

ట్యాంక్‌కు మెట్లు లేకపోవడంతో శుభ్రపరిచే పనులు సక్రమంగా జరగడం లేదని తెలిపారు. శిధిలమైన మెట్ల స్థానంలో కొత్త మెట్లు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరారు.

అనంతరం వ్యవసాయ మార్కెట్‌లో వడ్ల రాశులను పరిశీలించి, వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బోయిని ఆనంద్, నాగటి ఉపేందర్, నాగటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News