PRINT TIME: April 07, 2026 04:38 PM
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
April 07, 2026 02:55 PM
40 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలంలోని
నీర్నేముల: గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకులు, అధికారులు చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య అన్నారు. సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మంచినీటి ట్యాంకును పరిశీలించారు.
ట్యాంక్కు మెట్లు లేకపోవడంతో శుభ్రపరిచే పనులు సక్రమంగా జరగడం లేదని తెలిపారు. శిధిలమైన మెట్ల స్థానంలో కొత్త మెట్లు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరారు.
అనంతరం వ్యవసాయ మార్కెట్లో వడ్ల రాశులను పరిశీలించి, వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బోయిని ఆనంద్, నాగటి ఉపేందర్, నాగటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి