సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం
సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో MRPS మరియు MEF ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ శ్రీమతి నిమ్మల విధ్యాధరణి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమానత్వానికి ప్రతీకగా నిలిచారని, విద్యా విస్తరణకు మార్గదర్శకుడిగా సేవలందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, హక్కులు, అవకాశాలు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు, ఎంఈఎఫ్ (MEF) ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి