Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:39 PM

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం
April 11, 2026 08:50 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో MRPS మరియు MEF ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ శ్రీమతి నిమ్మల విధ్యాధరణి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమానత్వానికి ప్రతీకగా నిలిచారని, విద్యా విస్తరణకు మార్గదర్శకుడిగా సేవలందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, హక్కులు, అవకాశాలు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు, ఎంఈఎఫ్ (MEF) ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News