Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:57 PM

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం

సమానత్వానికి ప్రతీక పూలే – గోరంట్లలో జయంతి సందర్భంగా నేతల సందేశం
April 11, 2026 08:50 PM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో MRPS మరియు MEF ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ శ్రీమతి నిమ్మల విధ్యాధరణి మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమానత్వానికి ప్రతీకగా నిలిచారని, విద్యా విస్తరణకు మార్గదర్శకుడిగా సేవలందించారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, హక్కులు, అవకాశాలు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకులు, ఎంఈఎఫ్ (MEF) ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News