సమ్మె విరమణ.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించడంతో, శుక్రవారం రాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు.శనివారం తెల్లవారుజామున నుండి బస్సులు తిరిగి రోడ్లపైకి వచ్చాయి. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు, బస్సులు యథావిధిగా నడవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అధికారులు అన్ని రూట్లలో బస్సులను అందుబాటులోకి తెచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి