Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:09 AM

సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం

సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం

సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం
April 06, 2026 08:44 AM 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు డా. బాబు జగ్జీవన్ రామ్ అని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కాలేజ్ సమీపంలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సమాన అవకాశాలు, హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు.

అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు చైతన్యవంతంగా ఉండాలని, హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, నర్సింగ్ కోటయ్య, దేవరకొండ యాదగిరి, కన్జెర శ్రీను, నాగుల జ్యోతి, సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News