Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 PM

సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం

సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం

సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం
06-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు డా. బాబు జగ్జీవన్ రామ్ అని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కాలేజ్ సమీపంలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సమాన అవకాశాలు, హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు.

అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు చైతన్యవంతంగా ఉండాలని, హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, నర్సింగ్ కోటయ్య, దేవరకొండ యాదగిరి, కన్జెర శ్రీను, నాగుల జ్యోతి, సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం

Article Image

సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు డా. బాబు జగ్జీవన్ రామ్ అని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కాలేజ్ సమీపంలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సమాన అవకాశాలు, హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు.

అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు చైతన్యవంతంగా ఉండాలని, హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, నర్సింగ్ కోటయ్య, దేవరకొండ యాదగిరి, కన్జెర శ్రీను, నాగుల జ్యోతి, సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News