సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం
సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం
Editor Desk
సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు డా. బాబు జగ్జీవన్ రామ్ అని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ సమీపంలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సమాన అవకాశాలు, హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు.
అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు చైతన్యవంతంగా ఉండాలని, హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, నర్సింగ్ కోటయ్య, దేవరకొండ యాదగిరి, కన్జెర శ్రీను, నాగుల జ్యోతి, సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి