సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి: డా. పగడాల నాగేందర్
సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి: డా. పగడాల నాగేందర్
Editor Desk
సాహిత్యం సమాజ మార్పుకు ఆయుధం కావాలి – నాగార్జున కళాశాలలో విస్తృతోపన్యాసం
నాగార్జున కళాశాల,
సామాజిక ఉద్యమాలు, సాహిత్య రంగంలో అస్తిత్వ వాదాల ప్రాధాన్యం ఎప్పటికీ తగ్గదని ప్రముఖ కవి, విమర్శకుడు డా. పగడాల నాగేందర్ స్పష్టం చేశారు. ఇవి సజీవ స్రవంతుల్లా నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
బుధవారం నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఎం.ఏ తెలుగు విద్యార్థులకు “అస్తిత్వ ఉద్యమాలు – ఆరంభ వికాసాలు” అనే అంశంపై ఆయన విస్తృతంగా ఉపన్యసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీవాద, దళిత, బహుజన, ముస్లిం మైనార్టీ, ప్రాంతీయ అస్తిత్వ వాదాలు తాత్కాలికం కావని, సమాజంలో ఉన్న అసమానతలపై నిరంతర పోరాటాలని వివరించారు.
అణగారిన వర్గాలు తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం గొంతెత్తిన ప్రతిసారీ ఈ వాదాలు కొత్త దిశల్లో విస్తరిస్తాయని చెప్పారు. ప్రజాస్వామ్య సమాజంలో ఇవి ఎప్పటికీ సజీవంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సాహిత్యం కేవలం అలంకారానికి పరిమితం కాకుండా, అస్తిత్వ వాదాలకు ప్రతిబింబంగా నిలిచి సామాజిక మార్పుకు దోహదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాంతీయ అస్తిత్వ వాదాలు భాష, సంస్కృతి, వనరుల పరిరక్షణకు బలమైన పునాది వేస్తాయని విశ్లేషించారు.
“ప్రశ్నించే గొంతు ఉన్నంత కాలం, ఆత్మగౌరవ పోరాటం కొనసాగినంత వరకు అస్తిత్వ వాదాలకు అంతం లేదు. ఇవే సమాజ పురోగతికి ఇంధనం” అని నాగేందర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగాధిపతి డా. వెల్దండి శ్రీధర్, డా. వాస భూపాల్, డా. టంగుటూరి సైదులు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి