Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 02:37 PM

సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి: డా. పగడాల నాగేందర్

సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి: డా. పగడాల నాగేందర్

సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి: డా. పగడాల నాగేందర్
April 15, 2026 05:16 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సాహిత్యం సమాజ మార్పుకు ఆయుధం కావాలి – నాగార్జున కళాశాలలో విస్తృతోపన్యాసం

నాగార్జున కళాశాల,

సామాజిక ఉద్యమాలు, సాహిత్య రంగంలో అస్తిత్వ వాదాల ప్రాధాన్యం ఎప్పటికీ తగ్గదని ప్రముఖ కవి, విమర్శకుడు డా. పగడాల నాగేందర్ స్పష్టం చేశారు. ఇవి సజీవ స్రవంతుల్లా నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

బుధవారం నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఎం.ఏ తెలుగు విద్యార్థులకు “అస్తిత్వ ఉద్యమాలు – ఆరంభ వికాసాలు” అనే అంశంపై ఆయన విస్తృతంగా ఉపన్యసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీవాద, దళిత, బహుజన, ముస్లిం మైనార్టీ, ప్రాంతీయ అస్తిత్వ వాదాలు తాత్కాలికం కావని, సమాజంలో ఉన్న అసమానతలపై నిరంతర పోరాటాలని వివరించారు.

అణగారిన వర్గాలు తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం గొంతెత్తిన ప్రతిసారీ ఈ వాదాలు కొత్త దిశల్లో విస్తరిస్తాయని చెప్పారు. ప్రజాస్వామ్య సమాజంలో ఇవి ఎప్పటికీ సజీవంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సాహిత్యం కేవలం అలంకారానికి పరిమితం కాకుండా, అస్తిత్వ వాదాలకు ప్రతిబింబంగా నిలిచి సామాజిక మార్పుకు దోహదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాంతీయ అస్తిత్వ వాదాలు భాష, సంస్కృతి, వనరుల పరిరక్షణకు బలమైన పునాది వేస్తాయని విశ్లేషించారు.

“ప్రశ్నించే గొంతు ఉన్నంత కాలం, ఆత్మగౌరవ పోరాటం కొనసాగినంత వరకు అస్తిత్వ వాదాలకు అంతం లేదు. ఇవే సమాజ పురోగతికి ఇంధనం” అని నాగేందర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగాధిపతి డా. వెల్దండి శ్రీధర్, డా. వాస భూపాల్, డా. టంగుటూరి సైదులు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News