Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:11 AM

సామాజిక అధికారమే కాన్షిరాం లక్ష్యం

సామాజిక అధికారమే కాన్షిరాం లక్ష్యం

సామాజిక అధికారమే కాన్షిరాం లక్ష్యం
March 15, 2026 04:13 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

92వ జయంతి సందర్భంగా కక్కిరేణిలో ఘన నివాళి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో బహుజన సామాజిక విప్లవకారుడు కాన్షిరాం రమ్ 92వ జయంతి సందర్భంగా సామాజిక న్యాయ కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ సోమనబోయిన సింహాద్రి మాట్లాడుతూ, బహుజన సమాజానికి అధికారాన్ని అందించాలనే లక్ష్యంతో కాన్షిరాం బహుజన సమాజ్ పార్టీ ను స్థాపించి దేశ రాజకీయాల్లో కొత్త దిశను చూపారని తెలిపారు. సమాజ్‌వాది నాయకుడు మూలయం సింగ్ యాదవ్తో కలిసి 1993లో ఉత్తర్ ప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి సామాజిక మార్పుకు నాంది పలికారన్నారు.

పేదలు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలను ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి తీసుకురావచ్చని కాన్షిరాం నిరూపించారని ఆయన పేర్కొన్నారు. జ్యోతిరావు ఫూలే , B. R. అంబేద్కర్ , కాన్షిరాం, మండల్ భావజాలంతోనే సామాజిక మార్పు సాధ్యమని తెలిపారు. కుల గణన, రాజ్యాంగ పరిరక్షణ, హక్కుల సాధన కోసం ఉద్యమాలు బలోపేతం అయినప్పుడే భారత రాజకీయాల్లో కుల విముక్తి సాధ్యమవుతుందని అన్నారు.

అనంతరం గ్రామ పెద్దలు కలిసి ప్రొఫెసర్ సింహాద్రిని శాలువా కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు వేముల సైదులు, నూకల యాదయ్య, సోమనబోయిన ఆదినారాయణ, భాషకార్ల నరేందర్ రెడ్డి, శిగ రాజు గౌడ్, కన్నేబోయిన యాదయ్య, మల్లేష్, నరసింహ, అంకిరెడ్డి యాదయ్య ముదిరాజ్, నల్ల ప్రసాద్, యాదయ్య, స్వామి, చిర్రబోయిన సత్యనారాయణ, వేలిజాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News