Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:49 PM

సమాచార సాంకేతిక గోపురం ఉత్సవ విగ్రహమేనా..? నల్గొండ యువతకు ఉపాధి ఎప్పుడు..?

సమాచార సాంకేతిక గోపురం ఉత్సవ విగ్రహమేనా..? నల్గొండ యువతకు ఉపాధి ఎప్పుడు..?

సమాచార సాంకేతిక గోపురం ఉత్సవ విగ్రహమేనా..? నల్గొండ యువతకు ఉపాధి ఎప్పుడు..?
February 25, 2026 04:42 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, ఫిబ్రవరి 25:

జిల్లా యువతకు ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్యఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సమాచార సాంకేతిక గోపురం వద్ద ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కోట్ల రూపాయలతో నిర్మించిన గోపురం నేడు ఖాళీగా ఉండటం విచారకరమన్నారు. ఇతర నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే ఉపాధి లభిస్తుందని చెప్పి, ఇప్పుడు పెట్టుబడులు ఆహ్వానించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

అధికారంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ప్ర భుత్వం గత ప్రభుత్వంపై నెపం మోపడం సరైంది కాదన్నారు. ఇప్పటికే నిర్మించిన గోపురాన్ని సమర్థంగా వినియోగించి యువతకు నైపుణ్య శిక్షణ అందించి పరిశ్రమలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.

సమాచార సాంకేతిక గోపురం ఉత్సవ విగ్రహంలా మారి ప్రచారానికే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం తక్షణం చర్యలు తీసుకుని యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ఫె డరేషన్ అఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, నాయకులు సైఫ్, కిరణ్, రియాజ్, కుమార్, తరుణ్, కార్తీక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News