Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 09:11 PM

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
April 08, 2026 07:24 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” సింపోజియంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రిజర్వేషన్లు కేవలం ఒక నిబంధన కాదని, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందించడమే రిజర్వేషన్ లక్ష్యమని, జనాభా నిష్పత్తికి అనుగుణంగా వాటి అమలు జరగాలని సూచించారు. విద్యాసంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సమానత్వ భావనకు బలమైన పునాది వేసిన జ్యోతిరావు ఫూలేను ఆయన ఈ సందర్భంగా స్మరించారు. సామాజిక న్యాయం అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదని, గౌరవం, సమాన హక్కులు కూడా అందులో భాగమని పేర్కొన్నారు.

సింపోజియంలో పాల్గొన్న విద్యావేత్తలు కూడా రిజర్వేషన్ల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, కానీ సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని వారు తెలిపారు. కుల ఆధారిత అసమానతలు పూర్తిగా తొలగే వరకు రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ప్యానలిస్టులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News