Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:10 AM

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
April 08, 2026 07:24 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” సింపోజియంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రిజర్వేషన్లు కేవలం ఒక నిబంధన కాదని, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందించడమే రిజర్వేషన్ లక్ష్యమని, జనాభా నిష్పత్తికి అనుగుణంగా వాటి అమలు జరగాలని సూచించారు. విద్యాసంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సమానత్వ భావనకు బలమైన పునాది వేసిన జ్యోతిరావు ఫూలేను ఆయన ఈ సందర్భంగా స్మరించారు. సామాజిక న్యాయం అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదని, గౌరవం, సమాన హక్కులు కూడా అందులో భాగమని పేర్కొన్నారు.

సింపోజియంలో పాల్గొన్న విద్యావేత్తలు కూడా రిజర్వేషన్ల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, కానీ సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని వారు తెలిపారు. కుల ఆధారిత అసమానతలు పూర్తిగా తొలగే వరకు రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ప్యానలిస్టులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News