Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:52 PM

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
08-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” సింపోజియంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రిజర్వేషన్లు కేవలం ఒక నిబంధన కాదని, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందించడమే రిజర్వేషన్ లక్ష్యమని, జనాభా నిష్పత్తికి అనుగుణంగా వాటి అమలు జరగాలని సూచించారు. విద్యాసంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సమానత్వ భావనకు బలమైన పునాది వేసిన జ్యోతిరావు ఫూలేను ఆయన ఈ సందర్భంగా స్మరించారు. సామాజిక న్యాయం అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదని, గౌరవం, సమాన హక్కులు కూడా అందులో భాగమని పేర్కొన్నారు.

సింపోజియంలో పాల్గొన్న విద్యావేత్తలు కూడా రిజర్వేషన్ల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, కానీ సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని వారు తెలిపారు. కుల ఆధారిత అసమానతలు పూర్తిగా తొలగే వరకు రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ప్యానలిస్టులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

Article Image

హైదరాబాద్, సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” సింపోజియంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రిజర్వేషన్లు కేవలం ఒక నిబంధన కాదని, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అందించడమే రిజర్వేషన్ లక్ష్యమని, జనాభా నిష్పత్తికి అనుగుణంగా వాటి అమలు జరగాలని సూచించారు. విద్యాసంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సమానత్వ భావనకు బలమైన పునాది వేసిన జ్యోతిరావు ఫూలేను ఆయన ఈ సందర్భంగా స్మరించారు. సామాజిక న్యాయం అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదని, గౌరవం, సమాన హక్కులు కూడా అందులో భాగమని పేర్కొన్నారు.

సింపోజియంలో పాల్గొన్న విద్యావేత్తలు కూడా రిజర్వేషన్ల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, కానీ సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని వారు తెలిపారు. కుల ఆధారిత అసమానతలు పూర్తిగా తొలగే వరకు రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ప్యానలిస్టులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News