Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:55 PM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: పోలీసుల సూచనలు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: పోలీసుల సూచనలు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: పోలీసుల సూచనలు
April 04, 2026 07:25 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొండగడప:

కొండగడప గ్రామ పంచాయతీ కార్యాలయంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ బృందం సదస్సు నిర్వహించింది. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు కీలక సూచనలు చేశారు.

సైబర్ నేరాల ద్వారా తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియజేయవద్దని హెచ్చరించారు.

ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు పాటించడం ద్వారా నష్టాలను నివారించవచ్చని వివరించారు. అనుమానాస్పద కాల్స్, లింక్స్, మెసేజ్‌లను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ కొండ శోభా సోమల్లు, వార్డు అధికారులు, గ్రామ పెద్దలు, యువత, పోలీస్ బృందం, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News