సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: పోలీసుల సూచనలు
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: పోలీసుల సూచనలు
Editor Desk
కొండగడప:
కొండగడప గ్రామ పంచాయతీ కార్యాలయంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ బృందం సదస్సు నిర్వహించింది. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు కీలక సూచనలు చేశారు.
సైబర్ నేరాల ద్వారా తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియజేయవద్దని హెచ్చరించారు.
ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు పాటించడం ద్వారా నష్టాలను నివారించవచ్చని వివరించారు. అనుమానాస్పద కాల్స్, లింక్స్, మెసేజ్లను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ కొండ శోభా సోమల్లు, వార్డు అధికారులు, గ్రామ పెద్దలు, యువత, పోలీస్ బృందం, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి