రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం: సీఐ ఎన్. వెంకటేశ్వర్లు.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం – ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం: సీఐ ఎన్. వెంకటేశ్వర్లు.
Editor Desk
రామన్నపేట మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా “ARRIVE ALIVE CAMPAIGN–2026” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా మండలంలోని ప్రతి గ్రామంలో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రామన్నపేట, తుమ్మలగూడెం గ్రామాలలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ
కార్యక్రమంలో సీఐ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్ల వద్ద, మలుపుల వద్ద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారులపై ఉన్న గుంతలను పూడ్చడంతో పాటు రోడ్ల ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాలని కోరారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎస్ఐ, డి. నాగరాజు ఎస్ఐ, రామన్నపేట మరియు తుమ్మలగూడెం గ్రామాల సర్పంచ్లు, గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి