Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 08:07 PM

రోడ్డు భద్రత అందరి బాధ్యత: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

రోడ్డు భద్రత అందరి బాధ్యత: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

రోడ్డు భద్రత అందరి బాధ్యత: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్
April 16, 2026 04:18 PM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పట్టణంలో గురువారం 'సోషల్ మీడియా అవగాహన కార్యక్రమం' ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆటో, బస్సు, టాక్సీ, స్కూల్ బస్సు డ్రైవర్లతో ఇన్‌స్పెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు .డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి ధృవీకరణ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఓవర్‌లోడింగ్, మితిమీరిన వేగం, ప్రమాదకర డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్‌బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అవగాహన కల్పించారు.

సోషల్ మీడియా ప్రచారం:

సామాన్య ప్రజలకు, యువతకు అవగాహన కల్పించేందుకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా రోడ్డు నిబంధనలపై రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్ జీ ఓ) భాగస్వాములయ్యారు.​"ప్రతి డ్రైవర్ బాధ్యతగా వాహనం నడిపినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు." చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్,

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News