Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 06:43 PM

రోడ్డు భద్రత అందరి బాధ్యత: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

రోడ్డు భద్రత అందరి బాధ్యత: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

రోడ్డు భద్రత అందరి బాధ్యత: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్
April 16, 2026 04:18 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పట్టణంలో గురువారం 'సోషల్ మీడియా అవగాహన కార్యక్రమం' ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆటో, బస్సు, టాక్సీ, స్కూల్ బస్సు డ్రైవర్లతో ఇన్‌స్పెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు .డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి ధృవీకరణ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఓవర్‌లోడింగ్, మితిమీరిన వేగం, ప్రమాదకర డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్‌బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అవగాహన కల్పించారు.

సోషల్ మీడియా ప్రచారం:

సామాన్య ప్రజలకు, యువతకు అవగాహన కల్పించేందుకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా రోడ్డు నిబంధనలపై రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్ జీ ఓ) భాగస్వాములయ్యారు.​"ప్రతి డ్రైవర్ బాధ్యతగా వాహనం నడిపినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు." చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్,

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News