Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:07 AM

రేపటి నుంచి స్వీయ లెక్కల నమోదు ప్రారంభం.భారతి హాలికేరి

రేపటి నుంచి స్వీయ లెక్కల నమోదు ప్రారంభం.భారతి హాలికేరి

రేపటి నుంచి స్వీయ లెక్కల నమోదు ప్రారంభం.భారతి హాలికేరి
25-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌

జనగణన–2027లో భాగంగా తెలంగాణలో స్వీయ లెక్కల నమోదు ప్రక్రియ ఈ నెల 26 నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ భారతి హాలికేరి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదేనని, డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న మొదటి జనగణనగా ఇది ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారి కులగణన చేపడుతున్న నేపథ్యంలో ఈ జనగణనకు మరింత ప్రాధాన్యం ఉందన్నారు. ఈసారి స్వీయ లెక్కల నమోదు విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు.

ప్రజలు ఆన్లైన్ ద్వారా స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఇది తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. దీని వల్ల సమాచారం సేకరణ వేగవంతమవడంతో పాటు గణన సిబ్బంది పనిభారం తగ్గుతుందని వివరించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా 16 భాషల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, సమాచారం భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మొత్తం 33 ప్రశ్నల్లో 27 ప్రశ్నలకు స్వీయ లెక్కల నమోదు ద్వారా సమాధానాలు ఇవ్వవచ్చని, మిగిలిన ప్రశ్నలను గణన సిబ్బంది నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఎలాంటి పత్రాలు లేదా చిత్రాలు జత చేయాల్సిన అవసరం లేదని, ఎక్కడినుంచైనా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని చెప్పారు.

జనగణన ద్వారా లభించే సమాచారం అభివృద్ధి ప్రణాళికలకు కీలకమని, ప్రజలు ఖచ్చితమైన వివరాలు అందించాలని ఆమె కోరారు.

ఈ సందర్భంగా మహానగర పాలక సంస్థ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సంబంధిత ప్రాంతాల్లో వేలాది గణన సిబ్బంది, పర్యవేక్షకులు విధుల్లో ఉంటారని వెల్లడించారు.

అనంతరం జనగణన పోస్టర్లు, ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు.

Sthanikam

రేపటి నుంచి స్వీయ లెక్కల నమోదు ప్రారంభం.భారతి హాలికేరి

Article Image

హైదరాబాద్‌

జనగణన–2027లో భాగంగా తెలంగాణలో స్వీయ లెక్కల నమోదు ప్రక్రియ ఈ నెల 26 నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ భారతి హాలికేరి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదేనని, డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న మొదటి జనగణనగా ఇది ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారి కులగణన చేపడుతున్న నేపథ్యంలో ఈ జనగణనకు మరింత ప్రాధాన్యం ఉందన్నారు. ఈసారి స్వీయ లెక్కల నమోదు విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు.

ప్రజలు ఆన్లైన్ ద్వారా స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఇది తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. దీని వల్ల సమాచారం సేకరణ వేగవంతమవడంతో పాటు గణన సిబ్బంది పనిభారం తగ్గుతుందని వివరించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా 16 భాషల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, సమాచారం భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మొత్తం 33 ప్రశ్నల్లో 27 ప్రశ్నలకు స్వీయ లెక్కల నమోదు ద్వారా సమాధానాలు ఇవ్వవచ్చని, మిగిలిన ప్రశ్నలను గణన సిబ్బంది నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఎలాంటి పత్రాలు లేదా చిత్రాలు జత చేయాల్సిన అవసరం లేదని, ఎక్కడినుంచైనా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని చెప్పారు.

జనగణన ద్వారా లభించే సమాచారం అభివృద్ధి ప్రణాళికలకు కీలకమని, ప్రజలు ఖచ్చితమైన వివరాలు అందించాలని ఆమె కోరారు.

ఈ సందర్భంగా మహానగర పాలక సంస్థ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సంబంధిత ప్రాంతాల్లో వేలాది గణన సిబ్బంది, పర్యవేక్షకులు విధుల్లో ఉంటారని వెల్లడించారు.

అనంతరం జనగణన పోస్టర్లు, ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News